రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి: DCP
MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రహదారి భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన పెంచుకోవాలని మంచిర్యాల DCP భాస్కర్ పిలుపునిచ్చారు. శనివారం మందమర్రి పట్టణం యాపల్ ఏరియాలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియమాలను పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేలా పోలీస్ కళాబృందం కళాజాతను నిర్వహించారు.