ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే

ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే

BDK: నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. కరకగూడెం మండలం బుర్ధారంలో వెలసిన శ్రీ జ్వాలా లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంగళవారం ఎమ్మెల్యే విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.