రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
CTR: గంగవరం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతి కోర్టులో పనిచేసే యుగంధర్, హరీశ్తో పాటు మరికొందరు IPL మ్యాచ్ నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. అర్ధరాత్రి కారులో తిరిగి బయల్దేరారు. గంగవరం మండలం దండపల్లి బైపాస్ సమీపంలో లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో యుగంధర్, హరీష్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు క్షేమంగా బయటపడ్డారు.