చదవడం మాకు ఇష్టం కార్యక్రమం

చదవడం మాకు ఇష్టం కార్యక్రమం

VZM: తెర్లాం మండలం శాఖ గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని కృష్ణమూర్తి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు పుస్తక పఠనం వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈమేరకు విద్యార్థిలచే కథల పుస్తకాలు, ఇతిహాస గ్రంథాలు, నీతి కథలు, ఆధ్యాత్మిక కథలు చదివించారు. చిన్నతనం నుంచే ఏదో ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు.