మెరుగైన విద్యా బోధన అందించాలి: కలెక్టర్
ASR: పాడేరు మండలం తలారిసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజతో కలిసి కలెక్టర్ టీ.నిశాంతి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా బోధనను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో వివిధ తరగతి గదులను సందర్శించారు. వారికి అందుతున్న విద్యా బోధనపై ఆరా తీశారు.