నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: ఒంగోలు నగరంలో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ డీఈఈ పాండురంగరావు తెలిపారు. విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా ఒంగోలులోని సీతారామపురం ఏరియాలో శనివారం ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.