VIDEO: పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చేస్తున్న శానిటేషన్ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ నయం అహ్మద్ పరిశీలించారు. వార్డు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చెత్తను చెత్త బండికి ఇవ్వాలని సూచించారు. చెత్తను ఎక్కడబడితే అక్కడ పారబోస్తే రోగాలు ప్రబలుతాయన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.