'సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు'
PDPL: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై రమేష్ హెచ్చరించారు. ఓదెల మండలంలోని 22 గ్రామపంచాయతీలు పరిధిలోని ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, యువత ఈ విషయాన్ని గమనించాలన్నారు. గ్రామాల వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేయవద్దన్నారు.