ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్
WGL: ఈ నెల 15న వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయస్థానం పరిధిలోని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె. పట్టాభిరామారావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులను కోరారు.