గంజాయి గ్యాంగ్.. నలుగురు అరెస్ట్
WGL: నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏసీపీ శుభం (ఐపీఎస్) మాట్లాడుతూ.. గాంధీనగర్కు చెందిన సురేష్ (38)పై గాంజా గ్యాంగ్ రూ. 5 వేల రూపాయల సుపారీ తీసుకుని దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.