అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
తూ.గో: అంగన్వాడీ టీచర్ల డిజిటల్ సేవలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను శనివారం కోరుకొండ సీడీపీఓ కార్యాలయంలో పంపిణీ చేశారు. జనసేన 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా టీచర్లకు ఈ ఫోన్లను అందజేశారు.