జిల్లాలో ఎస్సైల బదిలీలు
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు జరిగినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గూడూరు ఎస్సై అశోక్ను కర్నూలు తాలూకా పోలీస్స్టేషన్కు, ఎమ్. తిమ్మయ్యను 3 టౌన్ నుంచి 2 టౌన్కు, జి. హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, ఏసీ. పీరయ్యను తాలూకా నుంచి 3 టౌన్కు బదిలీ చేశారు.