నకిలీ మద్యం కేసులో నిందితులకు మరోసారి కస్టడీ
NTR: నకిలీ మద్యం కేసులో నిందితులు ఏ1 జనార్దన్, ఏ2 జగన్ మోహన్లను విజయవాడ ఎక్సైజ్ కోర్టు మరోసారి కస్టడీకి అనుమతించింది. ఈ నెల 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు నిందితులను విచారించేందుకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఒక వారం పాటు విచారణ జరిగినప్పటికీ, వారి దగ్గర నుంచి మరింత కీలక సమచారం రాబట్టేందుకు అధికారులు ఈ కస్టడీని కోరారు.