పిచ్చాటూరు ఆరనియార్ ప్రాజెక్టులో యువకుడు మృతి
TPT: పిచ్చాటూరు ఆరనియార్ ప్రాజెక్టు వద్ద కేవీబీపురం మండలం మిద్ది కండిగ గ్రామానికి చెందిన నవీన్(23) శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. బెంగళూరులో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న నవీన్ మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లినట్లు బంధువులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.