మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన
PDPL: రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ షీ టీమ్ సభ్యులు మేడిపల్లి సెంటర్ NTPC వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించాలని తెలియజేశారు. మహిళలపై వేధింపులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.