RTC బస్ సర్వీస్ పునరుద్ధరించాలని డిమాండ్

RTC బస్ సర్వీస్ పునరుద్ధరించాలని డిమాండ్

RR: కొత్తగూడ ఇజ్జత్ నగర్ హైటెక్స్ గేట్ నుంచి మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉండేదని ఇటీవల నిలిపివేయడంతో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, తదితరులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.