పేదలకు ఈ పథకం వరంలాంటిది: ఎమ్మెల్యే

RR: కొత్తపేట డివిజన్ పరిధిలోని నాగేశ్వరరావు కాలనీకి చెందిన భాస్కరరావు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కారణంగా సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతుందని, ఈ పథకం పేదలకు వరం లాంటిదన్నారు.