పలు రాష్ట్రాలకు వర్ష సూచన

పలు రాష్ట్రాలకు వర్ష సూచన

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు మహారాష్ట్ర, గోవా, సౌత్ కర్ణాటకకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, తెలంగాణ, ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని సూచించింది.