VIDEO: భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

VIDEO: భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

ప్రకాశం: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కనిగిరి లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాల ప్రాంగణాల్లో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి, శివునికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.