పంచాయతీ భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన: కలెక్టర్

GDWL: ఉపాధి హామీ పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గద్వాల మండలం జిల్లెడ బండ తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.13 కోట్లతో గద్వాల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు.