చెట్లను అమ్ముకున్నారని గ్రామస్థుల నిరసన
ASF: కౌటాల మండలం ఖనికి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె పకృతి వనంలో ఉన్న నీలగిరి చెట్లను అమ్ముకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఖనికి గ్రామస్థులు MPDO కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పంచాయితీలో తీర్మానం లేకుండా సుమారు రూ.3 లక్షల విలువగల చెట్లను అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.