ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
KMR: ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో విజయ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జాబ్మేళా ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు శివకుమార్ (9346708846)ను సంప్రదించాలన్నారు.