ఆంధ్ర క్రికెట్ జట్టులో పలువురికి చోటు
ATP: ఈ నెల 9 నుంచి బరోడాలో వన్డే క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర అండర్–23 క్రికెట్ జట్టును ACA ప్రకటించింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. ఎంపికైన వారిలో MK. దత్తారెడ్డి (అనంతపురం), ఎస్.కామిల్ (గుంతకల్లు), మల్లికార్జున (రాప్తాడు) ఉన్నారు. స్టాండ్బైగా అర్జున్ (గొట్లూరు)ను ఎంపిక చేశారు.