అమరజీవి పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులు

అమరజీవి పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులు

ATP: గుంతకల్లులో అవోపా ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అవోపా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని కొనియాడారు. ఆయన కృషితోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.