ప్రతి ధాన్యం గింజ కొంటాం: కలెక్టర్
ప్రకాశం: రైతులకు మద్దతు ధర లభించే విధంగా ప్రతి ధాన్యం గింజ కొంటామని కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి జిల్లాలోని ఆర్ఎస్కేల్లో పేర్ల నమోదు నుంచి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు తెలపలన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ డీఎం వరలక్ష్మి, డీఎస్వో పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.