ఆసిఫాబాద్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.