ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేసిన మంత్రి
GNTR: తెనాలి నియోజకవర్గంలో 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.35,42,465 విలువైన చెక్కులను ఆదివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 524 మంది లబ్ధిదారులకు రూ.5,41,63,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందజేసినట్లు తెలిపారు.