మన్నేరు వాగులో వ్యక్తి గల్లంతు

మన్నేరు వాగులో వ్యక్తి గల్లంతు

ప్రకాశం: సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో గురువారం మన్నేరు వాగులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. హైదరాబాదులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, తన బాబాయ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సొంత ఊరికి వచ్చాడు. గల్లంతైన వెంకటేశ్వర్లు మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, అధికారులు గాలిస్తున్నారు.