ఢిల్లీ పేలుడు.. కారు పూర్వ యజమాని అరెస్ట్
ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు చోటుచేసుకున్న కారు పూర్వ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. హుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లుగా గుర్తించామని ఓ సినీయర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఘటన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.