రోడ్డు ప్రమాదంలో భారత క్రికెటర్ మృతి
భారత క్రికెట్లో విషాదం నెలకొంది. U-19 వరల్డ్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్రౌండర్ రాజేష్ బానిక్(40) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. త్రిపుర ఆనందానగర్లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. అగర్తలాలోని GBC ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బానిక్ మృతిపై పలువురు క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం తెలిపారు.