'డంపింగ్ యార్డ్ స్థలం కేటాయించాలి'
EG: ఉండ్రాజవరం (M)తాడిపర్రు గ్రామంలో సమగ్ర భూ కొలతలు పర్యవేక్షణ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి బుధవారం పర్యటించారు. బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, డంపింగ్ యార్డ్ కొరత, పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కిసాన్ మోర్చా నాయకులు కలెక్టర్ని శాలువ కప్పి సన్మానించారు.