సైబర్ వలలో చిక్కిన ఎమ్మెల్యే
ELR: ఎమ్మెల్యే సైబర్ మోసానికి గురైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ వలలో పడ్డాడు. RTA చలానా పేరుతో వచ్చిన యాప్ లింక్ను క్లిక్ చేయడంతో అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయమైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. బాధిత ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.