పాఠ్యాంశాల్లో మార్పు రావాలి: చంద్రబాబు
AP: కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధిపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 'కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పు రావాలి. సిలబస్లో మార్పు కోసం NCERT, వర్సిటీలను సంప్రదించాలి. ఉన్నతవిద్యలో AP, తమిళనాడు, కర్ణాటక అగ్రస్థానంలో ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉద్యోగావకాశాలు లభించేలా చూడాలి. స్నాతకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి' అని ఆయన సూచించారు.