ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన హోంమంత్రి
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ప్రతి అర్జీని సావధానంగా విని పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.