'దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి ఏసీఏ కృషి'

'దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి ఏసీఏ కృషి'

విశాఖ: దివ్యాంగుల క్రికెట్‌ అభివృద్ధికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఎల్లవేళలా కృషి చేస్తుందని ఏసీఏ గేమ్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ యం.ఎస్‌.కుమార్‌ వెల్లడించారు. ఏసీఏ ఆధ్వర్యంలో శనివారం పీఎం పాలెంలోని వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతుల క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.