నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
KKD: జిల్లాలో శనివారం నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు మొదలుకానున్నాయి. మొత్తం 227 కొనుగోలు కేంద్రాలను నిర్వ హించనున్నారు. రబీలో 6లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా, 3లక్షల టన్నులు పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరణ లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైతే మరింత ధాన్యాన్ని కొనడానికి కార్యాచరణ రూపొందించారు.