కళాశాలకు పూర్వ విద్యార్థులు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత
ఆదిలాబాద్: ఉట్నూర్ లోని ప్రభుత్వ గిరిజన ఐటీఐ కళాశాలలో 2024 బ్యాచ్కు చెందిన కోపా & స్టెనోగ్రాఫేర్ విద్యార్థులు రూ.25 వేల విలువైన వాటర్ ప్యూరిఫైయర్ను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్పు ఒకరితోనే సాధ్యమవుతుందని కళాశాల అభివృద్ధి, మండుతున్న ఎండల దృష్ట్యా విద్యార్థుల కోసం వాటర్ ప్యూరిఫైయర్ను అందజేయడం అభినందనీయమన్నారు.