జిల్లాలో భానుడి భగభగలు.. కానాయపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత
WNP: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కానాయపల్లిలో 41.0°C ఉష్ణోగ్రత నమోదైంది. దగడ(39.9°C), ఆత్మకూర్(39.0°C) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జిల్లాలోని 21 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 37°C దాటడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.