పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు అడ్డుకున్న రైతు
SKLM: బూర్జ మండలం అల్లెన గ్రామానికి చెందిన రైతు తవిటి నాయుడుతో వినూత్నంగా సోమవారం నిరసన తెలిపారు. పాలకొండ ప్రధాన రహదారి నుంచి అల్లెన గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం చర్యలు చేపట్టారు. తమ భూమి తీసుకుని, తమకు నష్ట పరిహారం ఇవ్వలేదని రైతు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుని, తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన వ్యక్తం చేశాడు.