T20 WC: నేడే మొదటి సెమీఫైనల్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్రేట్ కలిసొచ్చి సెమీస్కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.