రేపటి నుంచి పోలీస్ చట్టం అమలు

MDK: జిల్లాలో మే 1 నుంచి 31 వరకు పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.