చెట్లు నరికినందుకు రూ.20 లక్షల జరిమానా..!

MDCL: కూకట్పల్లిలో గల గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్పై అనుమతి లేకుండా చెట్లు నరికినందుకు అటవీ శాఖ అధికారులు రూ.20 లక్షల జరిమానా విధించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలన జరిపి చెట్లు నరికిన విషయం నిర్ధారించారు. అవసరమైన అనుమతులు తీసుకోకుండా చెట్లు నరికి పర్యావరణానికి నష్టం కలిగించినందుకు మేనేజ్మెంట్పై కూడా కేసు నమోదు చేశారు.