కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ అభివృద్ధి: ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ అభివృద్ధి: ఎమ్మెల్యే

KRNL: తుగ్గలి మండలంలో చెరువు తాండాలో రూ.26.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఇవాళ ఎమ్మెల్యే కేయి శ్యాంకుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. గిరిజన తాండాల అభివృద్ధిలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు. అభివృద్ధికి ఆకర్షితులై కొందరు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానించారు.