VIDEO: బాబోయ్ ఒకే చోట మూడు పులులు
సత్యసాయి: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పులులు ఓకేచోట కనిపించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం దగ్గర కొండ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గుతుండడంతో అడవిలో ఉండాల్సిన జంతువులు ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.