పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా పవన్: ఉదయ్
AP: పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జోస్యం చెప్పారు. నియోజకవర్గానికి ఆయన చేస్తున్న అభివృద్ధే అందుకు తార్కాణమని పేర్కొన్నారు. పిఠాపురంలో ఇప్పటికే 60 వేల మందితో జనసేన ఒక పెద్ద కుటుంబంగా మారిందన్నారు. పవన్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదని.. దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారని కొనియాడారు.