రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

WGL: రైలు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన నెక్కొండ మండలంలో శుక్రవారం ఉదయం జరిగింది. రైల్వేస్టేషన్ డౌన్ లైన్ వద్ద పట్టాలు దాటుతున్న వ్యక్తిని కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకు కళ్లముందే కనిపించిన వ్యక్తి.. నిమిషం వ్యవదిలో విగతజీవిగా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.