VIDEO: మదనపల్లె కిడ్నీ రాకెట్పై అధికారులు తనిఖీలు
అన్నమయ్య: మదనపల్లెలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డా. దేవశిరోమణి, డా. రమేష్ బాబులు జిల్లా ఆస్పత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాదు నుంచి వచ్చిన అపోలో డయాలసిస్ మేనేజర్తో సమావేశమై, స్థానిక సిబ్బందిని ప్రశ్నించారు.