VIDEO: పులిజాడ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన డీఎఫ్వో
KKD: శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ మానంపల్లి గ్రామంలో పులిని స్థానికులు చూశారని తెలపడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఏలేశ్వరం రేంజ్ అటవీ అధికారులతో పాటు డీఎఫ్వో రామచంద్రరావు స్వయంగా పులిజాడలు కనిపెట్టేందుకు అక్కడకు చేరుకున్నారు. ఆధునిక పరికరాలతో పులిని కనిపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పులి అభయారణ్యంలోకి వెళ్లే వరకు జాగ్రత్త వహించాలని సూచించారు.