దొరమామిడిలో ప్రమాదంలో వ్యక్తి మృతి

దొరమామిడిలో ప్రమాదంలో వ్యక్తి మృతి

ELR: దొరమామిడి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వలస కూలి మరణించాడు. పల్పాడు జిల్లా రాజపాలెం మండలం గణపవరానికి చెందిన మురికిపూడి నాని (23) పొగాకు తోటలో పనులకు దొరమామిడి వచ్చాడు. వ్యక్తిగత పని మీద వెళ్లి బైక్‌పై దొరమామిడి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాని అక్కడికి అక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.