కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి

కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి

SKLM: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రణస్థలంలోని రెడ్డీస్ ల్యాబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఉన్న బాయిలర్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, RDO కె. సాయి ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.